‘రజనీది ఆత్మహత్య కాదు హత్యే’.. భర్తే చంపాడంటున్న బంధువులు

జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం పంచాయతీ యారంవారిపాలేనికి చెందిన వివాహిత రజని(21) ఆత్మహత్య ఘటన కీలక మలుపు తీసుకుంది. రజని ఆత్మహత్య చేసుకోలేదని, భర్త ముసలయ్యే ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని రజని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ వారంతా సోమవారం ప్రాంతీయ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు రజని మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి భారీగా చేరుకున్న రజని బంధువులు, గ్రామస్థులు మార్చరీ వద్ద మృతురాలి భర్త తరఫు బంధువులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: రజనిని భర్త ముసలయ్యే హత్య చేశాడని, ఆమె చీర కాల్చివేసి ఆధారాలు లేకుండా చేయటానికి ప్రయత్నించారని మండిపడ్డారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ముసలయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. రజని బాబాయి చింతా మరియదాసు ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడైన భర్తతో పాటు ఆడపడుచు, మరో మహిళపై గృహ హింస నిరోధక చట్టం, ఆధారాలు చెరిపివేయటానికి ప్రయత్నించటం తదితర నేరాలపై కేసులు నమోదు చేసిన్నట్లు కర్లపాలెం ఎస్సై శ్రీహరి తెలిపారు. Also Read: కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం పంచాయతీ యారంవారిపాలెంకు చెందిన యారం ముసలయ్యకు, బాపట్ల మండలం మూలపాలేనికి చెందిన రజని(21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆదివారం వీరి రెండో వివాహ వార్షికోత్సవం. అయితే కొంతకాలంగా భర్త తీవ్రంగా వేధిచండంతో రజనీ మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమెన గమనించిన కుటుంబసభ్యులు బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. Also Read:
By August 11, 2020 at 07:54AM
No comments