Breaking News

వీడు కరోనా కంటే డేంజర్.. భార్యకు వైరస్ సోకిందని పరార్, అనాథలా చనిపోయిన యువతి


కారణంగా మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. రక్త సంబంధీకులు, అగ్నిసాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన వారు సైతం కరోనా వచ్చిందని తెలియగానే దూరమై పోతున్నారు. సమాజంతో ఎంతో గొప్పగా బ్రతికిన వారికి సైతం కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చేసే దిక్కు కూడా ఉండటం లేదు. కరోనా వైరస్‌పై ఉన్న అపోహలే ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నాయి. ఈ కోవనేలో కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్యకు కరోనా సోకిందని తెలుసుకున్న భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి పరారయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. Also Read: బెంగళూరులోని జేపీ నగర, శంకరమఠ వార్డులో గౌరి (27), మంజునాథ్‌ దంపతులు ఉంటున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన వీరు రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుని ఉపాధి కోసం వచ్చారు. మంజునాథ్ కారు డ్రైవర్‌గా, గౌరి ఓ షాపింగ్ మాల్‌‌లో పనిచేస్తున్నారు. బుధవారం ఆమెకు జ్వరం రావడంతో భర్త ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో పాటు కరోనా టెస్ట్ కూడా చేయించాడు. శుక్రవారం తర్వాత ఆమె కరోనా పాజిటివ్ అని తేలడంతో భార్యను హోమ్ క్వారంటైన్‌లో ఉంచి మంజునాథ్ పరారయ్యాడు. Also Read: ఇంట్లో తనను పట్టించుకునేవారు లేకపోవడంతో గౌరి నరకం అనుభవించింది. పడింది. అదేరోజు సాయంత్రం శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు రావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. శనివారం ఇంటి యజమాని ఆమెను గమనించి స్థానిక కార్పోరేటర్‌ శివరాజ్‌కు సమాచారం ఇచ్చాడు. ఆమె భర్త మంజునాథ్‌కు వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. కాసేపటికే ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతడు ఉద్దేశపూర్వకంగానే పారిపోయినట్లు గుర్తించారు. దీంతో వారు గౌరి బంధువులకు ఫోన్ చేయగా... ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయినప్పుడు ఆమెతో బంధం తెంచుకున్నామని చెప్పారు. దీంతో కార్పోరేటర్ అంబులెన్స్‌లో గౌరి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మంజునాథ్‌పై శంకరమఠ పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:


By August 11, 2020 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bangaluru-husband-eloped-from-house-when-he-know-his-wife-got-corona-positive-she-died/articleshow/77474932.cms

No comments