పెళ్లి ఇష్టంలేక మహిళా టెక్కీ ఆత్మహత్య... హైదరాబాద్లో విషాదం
పెళ్లి ఇష్టం లేక మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలకొండ గ్రామానికి చెందిన పులి లింగమ్మ ఎల్బీనగర్లోని పిండి నారాయణరెడ్డి కాలనీలో కొడుకు కృష్ణ, కుమార్తె లక్ష్మి(27)తో కలిసి ఐదేళ్లుగా నివసిస్తోంది. లక్ష్మి నగరంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తోంది. Also Read: ఇటీవల ఆమెకు తల్లి లింగమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోంది. బుధవారం పెళ్లి సంబంధం చూసేందుకు ఆమె కొడుకుతో కలిసిఈసీఐఎల్కు వెళ్లింది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి లక్ష్మి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందికి దించి చూడగా అప్పటికే చనిపోయింది. ఆత్మహత్య చేసుకునే ముందు లక్ష్మి తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడింది. Also Read: తనకు పెళ్లి ఇష్టం లేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని అతడికి చెప్పి కాల్ కట్ చేసింది. దీంతో ఆ యువకుడు లక్ష్మి ఇంటికి చేరుకునేసరికే ఉరేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. Also Read:
By August 07, 2020 at 10:55AM
No comments