ప్రియురాలితో ముచ్చట్లు.. యువకుడికి కత్తిపోట్లు.. అసలేం జరిగిందంటే

ఊరి చివర ప్రియురాలితో మాట్లాడుతున్న యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన జిల్లా గ్రామీణ మండలంలో బుధవారం జరిగింది. పులికాట్ తీర గ్రామం కొరిడికు చెందిన వెంకట రమణయ్యకు, అదే గ్రామానికి ఓ యువతితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో రమణయ్యను హెచ్చరించారు. ఇద్దరూ కలుసుకోకుండా యువతిని ఇంట్లోనే నిర్బంధించారు. Also Read: ఈ క్రమంలోనే యువతికి ఫోన్ చేసి రమణయ్య మాట్లాడుకుందామని చెప్పి ఊరి చివరకు రప్పించాడు. అక్కడ ఇద్దరూ కలిసి చెట్టు కింద కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటుండగా యువతి కుటుంబసభ్యులు గమనించి ఆమెపై దాడి చేసి తీసుకెళ్లారు. ఆమె అన్న యద్దెల కల్యాణ్ అలియాస్ బాబూజీ కత్తితో రమణయ్యపై దాడికి యత్నించడంతో అతడి కుడి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు రమణయ్యను సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రుడు అరగంటకు పైగా నిరీక్షించిన సూళ్లూరుపేట పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. మరోవైపు బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నెల్లూరు తరలించారు. Also Read: అయితే ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో పాతకక్షలను దృష్టిలో పెట్టుకునే రమణయ్యపై వైసీపీ వర్గం వారు దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీహరికోట ఎస్సై సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 13, 2020 at 11:23AM
No comments