Breaking News

ప.గో. జిల్లా: వివాహితతో సహజీవనం.. అనుమానంతో గొంతు నులిమి చంపేసి


తనతో సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తిని ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఉంగుటూరు మండలంలో బుధవారం జరిగింది. మండలం వెంకట్రామన్న గూడేనికి చెందిన రామలక్ష్మి (34) భర్త నుంచి విడిపోయి ముగ్గురు పిల్లలతో కలిసి నాచుగుంట శివారు తెలికిచర్ల వెళ్లే రహదారి పక్కన నివాసముంటోంది. ఇంటి పక్కనే ఉన్న యర్రా సూర్యారావుతో ఆమెకు మూడేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. Also Read: అయితే రామలక్ష్మి వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న సూర్యరావు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం ప్రియురాలిని నమ్మించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన సూర్యారావు గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం నుంచి రామలక్ష్మి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించారు. బుధవారం ఉదయం బహిర్భూమికి అడవిలోకి వెళ్లిన కొందరు మహిళలు అక్కడ రామలక్ష్మి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. Also Read: గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్‌ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి కొంతదూరంలో సూర్యారావు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. అతడిని హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు కొక్కెర సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. Also Read:


By August 06, 2020 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-girl-friend-before-he-try-to-suicide-in-west-godavari-district/articleshow/77384772.cms

No comments