Breaking News

అహ్మదాబాద్: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి


చోటుచేసుకుని, 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అహ్మదాబాద్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నవరంగ్‌పురలోని శ్రేయ ఆస్పత్రిలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. ఆస్పత్రిలో వ్యర్థాలకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు 40 మందిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూ వార్డులో చికిత్సకు చేరినవారిలో కొందరు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఐసీయూలో తొలుత మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారని అహ్మదాబాద్ నగర అసిస్టెంట్ కమిషనర్ ఎల్బీ జాలా పేర్కొన్నారు. చాలా మంది రోగులను అగ్నిమాపక సిబ్బంది రక్షించి, వేరే ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు వివరించారు. ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపడతామని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఆస్పత్రి తీసుకున్న చర్యలపై అనుమానం వ్యక్తమవుతోంది. దర్యాప్తులో వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు.


By August 06, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/eight-dead-after-fire-breaks-out-at-covid-19-hospital-at-ahmedabad-in-gujrat/articleshow/77384874.cms

No comments