ఆస్తి కోసం కన్నకొడుకునే సుత్తితో మోది హత్య... విశాఖలో ఓ తండ్రి ఘాతుకం

ఆస్తి తగాదాలు, ఆర్థిక కారణాలతో కన్న కొడుకునే దారుణంగా చంపేశాడో కిరాతక తండ్రి. ఈ ఘటన విశాఖ జిల్లా సమీపంలోని చినముషిడివాడ సత్యానగర్కాలనీ సమీపంలోని బంగారమ్మకాలనీలో బుధవారం జరిగింది. గొరిపాటి వీర్రాజు(72) అనే వ్యక్తి మర్చంట్ నేవీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు కుమారుడు జలరాజు(41), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలందరికీ వివాహాలయ్యాయి. Also Read: దీంతో వీర్రాజు కొడుకుతో కలిసి బంగారమ్మకాలనీలో నివాసం ఉంటున్నారు. జలరాజు కూడా మర్చంట్ నేవీలో పనిచేస్తున్నారు. ఆయన భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. దీనిపై తరుచూ గొడవ పడుతున్నారు. దీంతో కొడుకుపై కక్ష పెంచుకున్న వీర్రాజు బుధవారం ఉదయం సెల్లార్లో ఉన్న జలరాజుపై సుత్తితో దాడి చేశాడు. విచక్షణ మరిచి తలపై నాలుగుసార్లు సుత్తితో మోదడంతో జలరాజు రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. Also Read: బంధువులు, స్థానికులు అతడిని పెందుర్తి ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. దీంతో వీర్రాజు పెందుర్తి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు, పెందుర్తి ఎస్ఐలు శ్రీను, హరికృష్ణ ఘటన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. జలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. మృతుడి భార్య ఈశ్వరి ఫిర్యాదు మేరకు వీర్రాజుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By August 13, 2020 at 08:14AM
No comments