నడిరోడ్డుపై వివాహితకు వేధింపులు.. అడ్డుకున్న భర్త, పోలీసులపై యువకుల దాడి
భద్రాద్రి జిల్లా కేంద్రంలో నలుగురు యువకులు గురువారం అరాచకం సృష్టించారు. వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై వెంటాడి మరీ దాడి చేశారు. ప్రాణభయంతో అతడు పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్స్టేషన్లోకి వెళ్లి తలదాచుకున్నాడు. అయితే స్టేషన్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన యువకుడు అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Also Read: చుంచుపల్లి మండలానికి చెందిన దంపతులు కూరగాయలు కొనుగోలు చేయడానికి గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం రైతుబజార్కు వచ్చారు. కూరగాయలతో పాటు పండ్లు కొనుగోలు చేస్తుండగా ఓ యువకుడు మద్యం మత్తులో తూలుతూ వచ్చి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె భర్త యువకుడిని నిలదీయగా.. అతడి స్నేహితులు అజ్జు, అజీమ్, మున్ను, హమీద్లు కలిసి అతడిపై దాడికి తెగబడ్డారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయగా కత్తులు, కర్రలతో నలుగురు వెంటాడి నడిరోడ్డుపై అతడిని చితకబాదారు. Also Read: వారి నుంచి తప్పించుకున్న బాధితుడు రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో తలదాచుకొన్నాడు. దీంతో ఆ యువకులు స్టేషన్లోకి కూడా ప్రవేశించి హల్చల్ చేశారు. అడ్డుకోబోయిన ట్రాఫిక్ సిబ్బందిపైనా చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళ బాధితుడు, ఠాణా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 07, 2020 at 09:03AM
No comments