Breaking News

తెలంగాణలో 1931 కరోనా కేసులు.. హైదరాబాద్‌లో ఇటీవల ఎన్నడూ లేని రీతిలో..


తెలంగాణలో బుధవారం 1931 కరోనా కేసులను గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా 298 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో 144 కేసులను కొత్తగా గుర్తించగా.. రంగారెడ్డి జిల్లాలో 124 కేసులు నమోదయ్యాయి. మేడ్లచ్ జిల్లాలోనూ 71 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరీంనగర్‌లో 89, సంగారెడ్డిలో 86, ఖమ్మంలో 73, సిద్ధిపేటలో 71 చొప్పున కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 84, సూర్యపేటలో 64 చొప్పున కేసులను గుర్తించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (3) మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ రెండంకెల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో 23,303 టెస్టులు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 6.89 లక్షలు దాటింది. ఆగస్టు 12న 1780 మంది కోవిడ్ నుంచి కోలుకొని రికవర్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 63 వేలు దాటింది. బుధవారం రాష్ట్రంలో 11 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 665కి చేరింది. కోవిడ్ బాధితుల రికవరీ రేటు దేశంలో 70.37 శాతం ఉండగా.. తెలంగాణలో 72.93 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,736 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,621 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.


By August 13, 2020 at 08:56AM


Read More https://telugu.samayam.com/telangana/news/telangana-reports-1931-covid-19-cases-ghmc-has-less-than-400-new-cases/articleshow/77516785.cms

No comments