Breaking News

పోలీసుల నుంచి తప్పించుకున్న రేపిస్ట్.. లారీ కింద పడి దుర్మరణం


అత్యాచార కేసులో పోలీసులకు చిక్కిన నిందితుడు వారి నుంచి తప్పించుకునే క్రమంలో కంటైనర్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒడిశాలోని రాయగడలో చోటుచేసుకుంది. సంతోష్‌ కుమార్‌ పాండు అనే యువకుడిపై ఈ నెల 11న టికిరి పోలీస్‌‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదైంది. పోలీసులు అతడి కోసం గాలించి ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నిందితుడిని తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షల కోసమని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. Also Read: అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా సంతోష్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వాహనంలో నుంచి దూకి పారిపోతూ అటుగా వెళ్తున్న భారీ కంటైనర్ కింద ప్రమాదవశాత్తూ పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల సమాచారంతో ఫోరెన్సిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు తప్పించుకోబోయి చనిపోయాడా? లేక ఉద్దేశపూర్వకంగానే లారీ చక్రాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. Also Read:


By July 14, 2020 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rape-case-accused-died-in-road-accident-in-odisha/articleshow/76952805.cms

No comments