Breaking News

ప్రియుడి మోసం.. హైదరాబాద్‌లో న్యూస్ ఛానల్ ఉద్యోగిని ఆత్మహత్య


ప్రేమ విఫలం కావడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గల బన్సీలాల్‌పేటలో విషాదం నింపింది. ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు కళ్యాణి(26) నగరంలోని ఓ న్యూస్ ఛానల్‌లో కొంతకాలంగా పనిచేస్తోంది. బార్బర్ షాపులో పనిచేస్తున్న సోదరుడు సుమన్‌తో కలిసి బోలక్‌పూర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. తన సహోద్యోగి శివతో ఆమె రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరగా అతడు నిరాకరించాడు. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. Also Read: ఈ క్రమంలోనే సుమన్ సోమవారం ఉదయం విధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి రాగా కళ్యాణి ఉరేసుకుని కనిపించింది. దీంతో ఆందోళన చెందిన అతడు వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మంగళవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. తన కూతురి మరణానికి శివ కారణమంటూ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 15, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-in-hyderabad-over-boyfriend-cheating/articleshow/76970781.cms

No comments