Breaking News

దేశంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు.. కానీ ఓ గుడ్ న్యూస్


భారత్‌లో గడచిన 24 గంటల్లో 19,148 బారిన పడగా.. 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య ఆరు లక్షలు దాటింది. ఇప్పటి వరకూ 3.5 లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. మన దేశంలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 59.51 శాతంగా ఉంది. కాగా పాజిటివిటీ రేటు 8.34 శాతంగా ఉంది. మన దేశంలో ఇప్పటి వరకూ 6,04,641 కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం 2,26,947 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,59,860 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 17,834 మంది ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయారు. కరోనా వ్యాప్తి తీవ్రం కావడంతో.. కేసులను త్వరిగతిన గుర్తించడం కోసం కోవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్‌‌లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అన్‌లాక్-2 ప్రారంభం కావడంతో.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న గోవాలో నేటి (జులై 2) నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నారు. పర్యాటకులు హోటల్ గదులను బుక్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉండగా.. దాదాపు 27 లక్షల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో 1.28 లక్షల మంది వైరస్ కారణంగా చనిపోయారు. 14.48 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా.. ఈ దక్షిణ అమెరికా దేశంలో 60 వేల మందికిపైగా కోవిడ్‌కు బలయ్యారు. రష్యాలో 6.53 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 9521 మంది మాత్రమే చనిపోయారు. గత 12 రోజుల్లోనే మన దేశంలో దాదాపు 2 లక్షల కొత్త కేసులను గుర్తించారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కారణంగా దారుణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.


By July 02, 2020 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-cases-in-india-crosses-6-lakh-mark-with-over-19000-new-cases-in-24-hours/articleshow/76742966.cms

No comments