Breaking News

వచ్చే రెండు నెలల్లో పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం కసరత్తు


కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అధికారిక కార్యక్రమాల్ని, సభలు, సమవేశాల్ని వాయిదా వేశారు. ఏదైనా సమావేశాలు నిర్వహించిన సామాజిక దూరం, మాస్కులు ధరించే నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ అయినా... రాష్ట్రాల మంత్రివర్గ సమావేశాలు నిర్వహించినా ... సామాజిక దూరం తప్పనిసరి చేశారు. కరోనా ఎఫెక్ట్‌తోనే అటు కేంద్రం పార్లమెంట్ సమావేశాల్ని, ఇటు పలు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాల్ని అనుకున్న మేరకు నిర్వహించలేకపోయాయి. కరోనా కారణంగా బిల్లుల్ని వెంట వెంటనే పాస్ చేసి సమావేశాల్ని ముగించేశారు. పార్లమెంట్ వేసవి కాల సమావేశాల్లో ఇదే జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలను మార్చి 23వ తేదీనే ముగించారు. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 3వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయితే త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణకు కేంద్రం సిద్దమవుతోంది. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ సమావేశాలు ప్రారంభించాలని ఆలోచనలు చేస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో సమావేశాలను ఎలా నిర్వహించాలన్న దానిపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్ కసరత్తు చేస్తున్నారు. వర్చువల్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఈసారి లోక్‌సభ సమావేశాలను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో..రాజ్యసభ సమావేశాలను లోక్‌సభ ఛాంబర్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తున్నది. రెండు సమావేశాల మధ్య ఆరు నెలలకు మించి గ్యాప్‌ ఉండకూడదన్న నిబంధన ఉండటంతో వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 22కు ముందే ప్రారంభంకావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే కోరనా విజృంభిస్తున్న సమయంలో సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సభ ప్రారంభమయ్యే నాటికి ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


By July 02, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/parliament-monsoon-session-likely-in-central-hall/articleshow/76743009.cms

No comments