Breaking News

హైటెక్‌సిటీ వద్ద ఉద్రిక్తత.. నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తి హల్‌చల్.. ఎంపీనంటూ బిల్డప్


హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తుపాకీతో నడిరోడ్డుపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మాదాపూర్ మస్తాన్ నగర్ బస్తీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి కారులో(టీఎస్04ఈఎక్స్ 7777 ) వచ్చి దిగాడు. చేతిలో తుపాకీ పట్టుకుని రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కారు రోడ్డుకు అడ్డంగా నిలిపి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, స్థానికులు అతడిని నిలదీశారు. Also Read: దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి తుపాకీతో చంపేస్తానంటూ అందరినీ బెదిరించాడు. తాను అధికార పార్టీకి చెందిన వ్యక్తినని, ఎవరైనా ఎదురుతిరిగితే ప్రాణం తీస్తానంటూ కొద్దిసేపు నానా హంగామా చేశాడు. దీంతో స్థానికులు అతడిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా కారులో ఉడాయించాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడి కారుపై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని రాసి ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By June 10, 2020 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-hulchul-with-gun-at-hitech-city-in-hyderabad-police-booked-case/articleshow/76294907.cms

No comments