Breaking News

కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి.. పుట్టినరోజు నాడే విషాదం


తమిళనాడులో విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అక్కడ దాదాపు 35 వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, మహమ్మారి కారణంగా అన్బళగన్ (62) ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా దేశంలో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. కరోనా వైరస్‌ సోకిన అన్బళగన్.. చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన పుట్టిన రోజు కూడా ఇవాళే కావడం బాధాకరం. Read Also: అన్బళగణ్ కరోనా వైరస్‌తో జూన్ 2న క్రోమ్‌పేట్‌లోని డాక్టర్ రేలా ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో చేరినట్టు అధికారులు వెల్లడించారు. వైద్యులు చికిత్స అందజేస్తున్నా ఆయన పరిస్థితిలో మార్పు రాకపోగా.. క్రమంగా దిగజారుతూ వచ్చింది. మంగళవారం రాత్రి నుంచి మరింత దిగజారి, బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. ఆయనను బతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయనకు చికిత్స అందజేసిన వైద్యుడు పేర్కొన్నారు. Read Also: హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందజేశామని, తక్కువ మొత్తంలో ఆయనకు ఆక్సిజన్ అవసరమైందని, చికిత్సకు సైతం స్పందించారన్నారు. అయితే, అన్బళ్‌గన్‌కు ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని తెలిపారు. Read Also: కాగా, 2001, 2011, 2016 ఎన్నికలలో చెపాక్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా అన్బళగన్ ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినీ డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. జయం రవి కథానాయకుడిగా అదిభగవాన్ చిత్రాన్ని కూడా నిర్మించారు.


By June 10, 2020 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-dmk-mla-j-anbazhagan-dies-of-covid-19-in-chennaia-hospital/articleshow/76294819.cms

No comments