Breaking News

హైదారబాద్‌లో దారుణం.. భార్యను హీటర్‌తో కొట్టి చంపిన భర్త


మద్యం మత్తు అనేక మంది జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక... తమవారి ప్రాణాల్నే బలితీసుకుంటున్నారు. తాజాగా తాగిన మత్తులో ఓ భర్త కట్టుకున్న భర్యనే కడతేర్చాడు. బాలింత అని కూడా చూడకుండా ఆమెను చావబాదాడు. భర్త కొట్టిన దెబ్బలు తాళలేక ఆమె ప్రాణాలు వదిలింది. ఈఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్డు నం.2లోని ఇందిరానగర్‌లో నివసించే రుడావత్‌ అనిల్‌(31) వికారాబాద్‌ జిల్లాకు చెందిన అనిత(29) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. సినిమా సెట్టింగులు, వేదికల అలంకరణ సామగ్రి అద్దెకిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా నెలన్నర క్రితం మరో బాబు పుట్టాడు. కొన్నేళ్లుగా అనిల్‌ కట్నం కోసం వేధిస్తుండడంతో రెండేళ్ల క్రితం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి పూటుగా మద్యం తాగివచ్చి భార్యతో గొడవకు దిగాడు. బాలింత అనీ కూడా చూడకుండా మద్యం మత్తులో హీటర్‌తో భార్యను కొట్టాడు. 'వద్దు నాన్నా... అమ్మని కొట్టవద్దని' అని కుమార్తె కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు కసాయి తండ్రి. దెబ్బలకు తాళలేని భార్య మృతిచెందగానే అక్కడ్నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నెలన్నర బాబు తల్లిపాల కోసం గుక్కపెట్టి ఏడుస్తుండటం, మిగిలిన ముగ్గురు పిల్లల తల్లి చనిపోవడంతో పాపం వారికి ఏం చేయాలో తెలయిక అమాయకంగా చూస్తున్నారు. వీరిని చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.


By June 01, 2020 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/husband-killed-wife-after-consume-alcohol-at-hyderabad/articleshow/76128556.cms

No comments