త్వరగా ఇంటికెళ్దామని తిరిగిరాని లోకాలకు.. కడపలో విషాదం

జిల్లాలో విషాద ఘటన జరిగింది. త్వరగా ఇంటికెళ్దామని భావించి ఇద్దరు మహిళలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నడిచి వెళ్తే ఆలస్యమవుతుందని భావించి వేరుశెనగ కాయలు ఒలిచే మిషన్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామానికి చెందిన రూతమ్మ(35), వెంకటసుబ్బమ్మ(42) గోపరాజుపల్లె సమీపంలోని వేరుశెనగ పొలంలో పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరే సమయంలో వేరుశనగ కాయలు ఒలిచే మిషన్ను లాక్కెళ్లేందుకు ట్రాక్టర్ వచ్చింది. మిషన్పై ఎక్కి కూర్చుంటే త్వరగా ఇంటికి వెళ్లొచ్చన్న తొందరతో మిషన్పైకి ఎక్కారు. గోపరాజుపల్లె సమీపంలోకి రాగానే ట్రాక్టర్ కుదుపులకు ప్రమాదవశాత్తూ వేరుశనగ మిషన్ తిరగబడింది. దీంతో మిషన్పై కూర్చున్న ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. వారిపై మిషన్ పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Also Read: త్వరగా ఇంటికెళ్దామనుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో మాచునూరు హరిజనవాడలో విషాదచాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్కి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. Read Also:
By June 24, 2020 at 01:09PM
No comments