మద్యం మత్తులో భర్తతో గొడవపడిన మహిళ.. తెల్లారేసరికి శవమై
మద్యం మత్తులో భర్తతో గొడవపడిన మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా బాలానగర్ మండలంలో జరిగింది. బాలానగర్ బిల్డింగ్ తండాకు చెందిన గంగ్యా నాయక్, చాంద్బీ (35) భార్యాభర్తలు. కొంతకాలంగా దంపతులిద్దరూ గొడవ పడుతున్నారు. శనివారం ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత మరోసారి గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన చాంద్బీ రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న విషపు గుళికలు మింగేసింది. Also Read: తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన చాంద్బీని గుర్తించిన భర్త గంగ్యా నాయక్ వెంటనే షాద్నగర్ హాస్పిటల్కు తరలించాడు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు ఆదివారం ఉదయం చాంద్బీ ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By June 01, 2020 at 11:39AM
No comments