Breaking News

కరోనా వ్యాక్సిన్ ధర ఫిక్స్ చేసిన హెటెరో.. ఎంతంటే


దేశంలో విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజులుగా ప్రతీరోజు కొత్త కేసుల సంఖ్య 14 వేలకు పైగా ఉంది. దీంతో కరోనా కోసం పరిశోధనలు మరింత వేగవంతం అయ్యాయి. దీనికి మందు కనిపెట్టే పనిలో పడ్డాయి భారతదేశానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీలు. ఈ క్రమంలోనే ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో డ్రగ్స్ కోవిడ్‌-19 చికిత్సకు రెమ్‌డెసివిర్‌ ఔషధం 'కోవిఫర్‌' ను తయారు చేసిన సంగతి మనకు తెలిసిందే. కొవిడ్‌- 19 వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్న 'రెమ్‌డెసిర్‌' జనరిక్‌ ఔషధాన్ని దేశీయంగా పంపిణీ ప్రారంభించినట్లు హైదరాబాద్‌కు హెటెరో హెల్త్‌కేర్‌ బుధవారం ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఔషదానికి ఐసీఎంఆర్ కూడా అనుమతిచ్చింది. అయితే హెటిరో సంస్థ 'కోవిఫర్‌' ధరను రూ.5,400గా నిర్ణయించింది. ముందుగా 20,000 వయల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ బుధవారం తెలిపింది. ఇందులో 10,000 వయల్స్‌ హైదరాబాద్, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు త్వరలోనే సరఫరా చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. భువనేశ్వర్‌, రాంచీ, విజయవాడ, కోచి, త్రివేండ్రం, గోవా తదితర నగరాలకు వారం రోజుల వ్యవధిలో ఈ ఔషధాన్ని సరఫరా చేయగలమని పేర్కొంది. 'కొవిఫర్‌' 100 ఎంజీ వయల్‌ (ఇంజక్టబుల్‌) రూపంలో వస్తుంది. ఒక్కో ఇంజక్షన్‌ వయల్‌కు రూ.5,400 ధర నిర్ణయించినట్లు హెటెరో హెల్త్‌కేర్‌ వెల్లడించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. తాజాగా 891 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్‌ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది. ఏపీలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. బుధవారం 497 కొత్త కేసులు నమోదు అయ్యాయి.


By June 25, 2020 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hetero-prices-generic-covid-19-drug-at-rs-5400-per-vial/articleshow/76616368.cms

No comments