Breaking News

విశాఖలో రౌడీ షీటర్ రాఖీ గ్యాంగ్ వీరంగం


విశాఖలో ఇటీవల కాలంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ సామాన్యుల్ని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా వైజాగ్‌లోని రామచంద్రాపురంలో రాఖీ గ్యాంగ్... రూపేష్ అనే వ్యక్తిని వెంబడించింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం రౌడీ షీటర్ రాఖీ తన గ్యాంగ్‌తో రూపేష్ అనే దొంగను వెంబడించింది. దీంతో రూపేష్ వారి నుంచి చాకచక్యంగా తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. రూపేష్ కూడా పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. దీంతో రామచంద్రాపురం ఏరియాలో రూపేష్ ఒంటరిగా ఉన్నాడన్న సమాచారం అందుకున్న రాఖీ గ్యాంగ్‌ అతడ్ని వెంబడించింది. రూపేష్‌ను వెంబడించిన క్రమంలో అక్కడున్న కొందరి జనాన్ని తోసుకుంటూ, నెట్టుకుంటూ వెళ్లారు గ్యాంగ్ సభ్యులు.దీంతో ఈ ఘటనలో పలువురు స్వల్పగాయాల పాలైనట్లు కూడా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాల్ని చూసిన పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. రాఖీ, మురళి , సతీష్, మహేష్ మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. నిందితుల్ని వెతికే పనిలో పడ్డారు. ఇటీవల కాలంలో విశాఖలో ఓ రౌడీషీటర్ తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేశాడు. అయితే పోలీసుల ఎంట్రీతో ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. నగరానికి చెందిన రౌడీషీటర్ చిట్టిమాము బర్త్ డే సెలబ్రేషన్స్‌‌ను శనివారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఇతను మరో రౌడీ షీటర్ ఖాసీం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సినీ ఫక్కీలో మందీమార్బలంతో, బౌన్సర్లతో పుట్టిన రోజు వేడుకలను ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయం టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో దాడులు జరిపారు. రౌడీషీటర్ చిట్టిమాముతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురిని అరెస్ట్ చేశారు.


By June 25, 2020 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-case-file-on-vizag-rowdy-sheeter-rakhi-gang/articleshow/76618117.cms

No comments