Breaking News

ఫలించిన అమిత్ షా మంత్రాంగం.. మణిపూర్ రాజకీయ సంక్షోభానికి తెర


మణిపూర్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడింది. కేంద్ర హోం మంత్రి, అగ్రనేత రంగంలోకి దిగడంతో రెబల్స్ వెనక్కుతగ్గారు. దీంతో నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి గండం తప్పినట్టయ్యింది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఎన్పీపీ, టీఎంసీ, ఇండిపెడెంట్ సహా బీజీపీ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో సంక్షోభం తలెత్తింది. నాలుగు రోజుల కిందట మణిపూర్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడగా, కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కాంగ్రెస్ సైతం పావులు కదిపింది. అయితే, పరిస్థితి చేజారుతుందని గ్రహించిన కమలదళం అగ్రనేతలు రంగంలోకి దిగారు. అమిత్ షా, జేపీ నడ్డాల మంత్రాంగం ఫలించింది. బుధవారం షాతో ఎన్పీపీ రెబల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఆపై మేఘాలయా ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని నిర్ణయించిందని బీజేపీ ఈశాన్య రాష్ట్రాల ట్రబుల్ షూటర్ హిమాంత బిశ్వ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ బృందం మణిపూర్ డిప్యూటీ సీఎం వై జాయ్ కుమార్‌తో కలిసి న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మణిపూర్‌లో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్పీపీ తమ మద్దతును కొనసాగిస్తుంది’ అని హిమాంత బిశ్వ తెలియజేశారు. పాలక కూటమికి చెందిన తొమ్మిది మంది శాసనసభ్యులు, పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గత బుధవారం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన ముగ్గురు, ఎన్పీపీకి చెందిన నలుగురు, బయట నుంచి మద్దతిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి బీజేపీకి షాక్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడగా, బీజేపీ అధినాయకత్వం స్పందించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేసి విజయవంతమైంది. లాక్‌డౌన్ సమయంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం బియ్యం కేటాయింపుపై వివాదం నేపథ్యంలో మంత్రి యుమ్నామ్ జాయ్‌కుమార్ సింగ్‌ను మంత్రివర్గం నుంచి బీరెన్ సింగ్ తొలగించారు. దీంతో సీఎం బీరేన్ సింగ్‌ను గద్దె దింపాలని ఎన్పీపీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురేశారు. అయితే, బీజేపీ అధిష్ఠానం మేల్కోవడంతో సంక్షోభం సమసిపోయింది.


By June 25, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-says-manipur-crisis-over-after-4-mlas-of-upset-ally-meet-union-home-minister-amit-shah/articleshow/76617973.cms

No comments