Breaking News

ప్రేమపెళ్లి చేసుకున్న 3 నెలలకే బాలిక ఆత్మహత్య.. తెలంగాణలో విషాదం


ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలిక మూడు నెలలకే ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ మండలం పరిధిలోని గుండాల్ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన గుడిసె నర్సింహులు, లక్ష్మి దంపతుల కూమార్తె నవనీత(17), అదే గ్రామానికి చెందిన జన్మండ్ల హన్మంతురెడ్డి కుమారుడు శివకుమార్‌రెడ్డి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వలస వచ్చారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వారికి ఉపాధి దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే భర్త తనను వేధిస్తున్నాడని నవనీత తల్లికి అనేకసార్లు ఫోన్ చేసి బాధపడింది. Also Read: నెల రోజుల క్రితం శివకుమార్‌రెడ్డి భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చి నవనీతను పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి మనస్తాపంగా ఉంటున్న బాలిక ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. Also Read:


By June 02, 2020 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/17-yr-old-girl-commits-suicide-in-ranga-reddy-district-after-3-months-of-marriage/articleshow/76148716.cms

No comments