Breaking News

నాన్నను మా అమ్మే చంపేసింది.. 15ఏళ్ల తర్వా​త కుమార్తె ఫిర్యాదు


తన కన్నతండ్రిని తల్లే చంపిందంటూ 15ఏళ్ల తర్వాత కుమార్తె ఫిర్యాదు చేయడం కర్ణాటకలో కలకలం రేపింది. కొప్పల్ జిల్లా పట్టణానికి చెందిన లక్ష్మీ సింగ్ అనే మహిళపై కూతురు వింధ్యా సింగ్ ఈ ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.... గంగావతిలోని జయనగర్‌లో లక్ష్మీసింగ్‌, శంకర్‌సింగ్‌ దంపతులు నివసించేవారు. లక్ష్మీసింగ్‌ పరాయి వ్యక్తులతో సన్నిహితంగా ఉండటంతో భర్త తరుచూ ఆమెతో గొడవపడేవాడు. దీంతో ఆమె 2005 ఆగస్టు నెలలో ముగ్గురు స్నేహితులతో కలిసి భర్త శంకరసింగ్‌కు నిద్రమాత్రలు ఇచ్చి అనంతరం గొంతు నులిమి హత్య చేయించింది. ఎవరూ గుర్తుపట్టకుండా మృతదేహాన్ని పెరట్లోనే పాతిపెట్టింది. భర్త తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడంటూ కట్టుకథ అల్లి అందరినీ నమ్మించింది. Also Read: కొంతకాలం అనంతరం లక్ష్మీసింగ్‌ ఆ ఇంటిని శివనగౌడ అనే వ్యక్తికి అమ్మింది. అతను ఆ ఇంటికి ప్రహరీ నిర్మించేందుకు 2015లో పునాది తీస్తుండగా అస్థిపంజరం బయటపడింది. ఈ విషయం లక్ష్మీసింగ్‌ కుమార్తెలు ఆశా, వింధ్యకు తెలిసి ఆనవాళ్ల ఆధారంగా అది తమ తండ్రిదేనని గుర్తించారు. వెంటనే లక్ష్మీసింగ్‌, ఆమె కుమార్తెలు శివనగౌడ సహకారంతో అస్థిపంజరాన్ని కారులో హొసపేటె శివారుకు తరలించి ముళ్లకంపలో వేసి దహనం చేశారు. Also Read: ఈ విషయం ఎవరికైనా చెబితే మీ తండ్రికి పట్టిన గతే మీకూ పడుతుందని లక్ష్మీసింగ్ కూతుళ్లను బెదిరించింది. మే 20వ తేదీన విరుపాపురనగర్‌లో నివసించే ఆశాతో లక్ష్మీసింగ్ గొడవపడింది. తనతో పెట్టుకుంటే చంపేస్తానని తల్లి బెదిరించడంతో భయపడిన ఆశా ఈ విషయాన్ని తన సోదరి వింధ్యాసింగ్‌కు ఫోన్ చేసి చెప్పింది. తల్లి ఆగడాలు శ్రుతిమించుతున్నాయని భావించిన ఆమె మే 30వ తేదీ గంగావతి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో తన తండ్రిని తల్లే చంపేసిందని, తమను కూడా చంపుతానని బెదిరించడంతోనే ఇన్నాళ్లూ బయటకు చెప్పలేదని వింధ్యాసింగ్ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ వెంకటస్వామి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By June 02, 2020 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/karnataka-woman-complains-to-police-over-mother-kills-her-father-in-15-years-ago/articleshow/76147198.cms

No comments