Breaking News

కాళ్లు చేతులు విరగ్గొట్టి, బండరాయితో మోది.. మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణహత్య


జిల్లాలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. చిట్టబోయిన సురేష్‌ (30) అనే యువకుడిని కాళ్లు చేతులు విరగ్గొట్టి ముఖంపై బండరాయితో మోది దారుణంగా చంపేశారు దుండగులు. ఈ ఘటన చేగుంట మండలం చందాయిపేట గ్రామ సమీపంలోని చెరువు వద్ద సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం ఉదయం చెరువు వైపు వెళ్లిన గ్రామస్తులు ఇసుకలో పడి ఉన్న సురేష్‌ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. Also Read: ఘటనాస్థలిలో మద్యం సీసాలు లభించడంతో తెలిసిన వ్యక్తులే సురేష్‌ను మద్యం తాగించి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించేందుకు పోలీసులు యత్నించగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. జాగిలాలను రప్పించి నిందితుల ఆచూకీ కనుగొన్న తర్వాతే తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రప్పించగా అవి మక్కరాజుపేట రోడ్డులో ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఘటన స్థలాన్ని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌, రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్‌లు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. Also Read:


By May 27, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-killed-in-medak-district-police-under-investigation/articleshow/76022905.cms

No comments