Breaking News

హైదరాబాద్‌లో యువకుడి హత్య.. మద్యం మత్తులో స్నేహితుల ఘాతుకం


హైదరాబాద్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రొడా మిస్ట్రీనగర్‌ ముస్లీమ్ గ్రేవియార్డ్ వద్ద హఫీజ్(21) అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు బండరాయితో తీవ్రంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసలుు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలిలో మద్యం సీసాలు ఉండటంతో మద్యం మత్తులోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. Also Read: అక్బర్, అన్ను, సలీమ్ అనే వ్యక్తులను నిందితులుగా అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా హఫీజ్‌కు స్నేహితులేనని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. Also Read:


By May 27, 2020 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-murdered-by-friends-in-hyderabad-3-arrested/articleshow/76023287.cms

No comments