Breaking News

కరోనా పేషెంట్‌తో డాక్టర్ అసభ్య ప్రవర్తన


కరోనా పేషంట్లను సైతం కామాంధులు వదలడం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లపై కూడా అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఐసీయూలో ఉన్న ఓ కరోనా పేషెంట్‌తో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అతనిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది నవీ ముంబై మెడికల్ కాలేజ్‌లో విద్యఅభ్యసించిన ఓ యువకుడు వోక్‌హార్డ్ హాస్పిటల్‌లో ఏప్రిల్ 30న డాక్టర్‌గా అపాయింట్ అయ్యాడు. ఆ తర్వాత రోజున ఓ కోవిడ్ పేషెంట్ ఆసుపత్రిలోని ఐసీయూలో జాయిన్ అయ్యాడు. అతడికి చికిత్స చేయాల్సింది పోయి ఆ డాక్టర్ పేషెంట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పేషంట్ ఉండే ఐసీయూ గదిలోకి వెళ్లిన డాక్టర్ అతడిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కరోనా కోసం చికిత్స పొందుతున్న పేషెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు పేషెంట్ అతడి చర్యలను ప్రతిఘటించాడు. వెంటనే అక్కడ ఉన్న అలారమ్ బటన్‌ను నొక్కడంతో ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో అంతా అక్కడకు చేరుకున్నారు. డాక్టర్ పై తగిన చర్యలు తీసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు అతడ్ని విధుల నుంచి తొలగిస్తూ ఆస్పత్రి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నిందితుడు కరోనా వైరస్ సోకిన రోగికి సమీపంగా వెళ్లినందున వైరస్ సోకే అవకాశాలు ఉండవచ్చన్న అనుమానంతో అతడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేదు. థానేలోని అతని ఇంటిలోనే స్వగృహంలో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పోలీసులు. తాజాగా ఈ ఆస్పత్రిలో వైద్యులతో సహా 80 మంది కరోనా బారిన పడటంతో సుమారు నెల రోజుల వరకు ఆసుపత్రిని మూసివేశారు. అనంతరం ఏప్రిల్ 23న హాస్పిటల్‌ను తిరిగి ప్రారంభించారు.


By May 04, 2020 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/doctor-mis-misbehave-with-corona-patient-in-icu-ward/articleshow/75527423.cms

No comments