Breaking News

టిక్‌టాక్‌లో పరిచయం.. పెళ్లి పేరుతో యువతిపై రెండుసార్లు అత్యాచారం


ఇటీవల కాలంలో యాప్ విపరీతంగా ప్రజల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చాలామంది తమలోని టాలెంట్‌ను దీని ద్వారా ఇతరులకు తెలిసేలా చేసుకుంటున్నారు. దీనిద్వారా ఛాటింగ్‌ కూడా చేసుకునే సౌకర్యం ఉండటంతో కొందరు ఇతరులతో పరిచయాలు సైతం పెంచుకుంటున్నారు. ఇలాగే టిక్‌టాక్ వీడియోలు చేసే ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే అతడికి పెళ్లయి నలుగురు పిల్లలుండటం గమనార్హం. ఈ ఘటన నగరంలో వెలుగుచూసింది. Also Read: హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన యువతి(27)కి గత డిసెంబరులో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌లో నివసించే అక్బర్‌షా(34)తో టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. యువతి చేసే వీడియోలకు అతడు లైకులు కొడుతూ పరిచయం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడి రోజూ ఛాటింగ్ చేసుకునేవారు. కొద్దిరోజుల తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి వెంట తిప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: ఆమె పెళ్లికి ఒత్తిడి తీసుకురావడంతో దూరపు బంధువుల సమక్షంలో ఫేక్ నిశ్చితార్థం చేసుకుని మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో మోసపోయానని బాధితురాలు గ్రహించింది. అతడి గురించి లోతుగా ఆరా తీయగా పెళ్లయి పదేళ్ల అయిందని, నలుగురు పిల్లలున్నారని తెలిసింది. దీంతో ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్బర్‌షాపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:


By May 18, 2020 at 06:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-arrested-for-molesting-woman-befriended-via-tiktok/articleshow/75796239.cms

No comments