Breaking News

ఏడాది క్రితం పారిపోయిన జంట... పొలంలో శవమైన ప్రియుడు.. ఆస్పత్రిలో మహిళ


వారిద్దరూ వివాహితులే. అయినప్పటికీ జీవిత భాగస్వాములను కాదనుకుని పరాయి వ్యక్తులతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకుని కుటుంబాలను కాదనుకుని వెళ్లిపోయారు. ఏమైందో తెలీదు గానీ చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని జిల్లాలో జరిగింది. జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు, మహిళకు వేర్వేరు వ్యక్తులతో గతంలోనూ వివాహాలు అయ్యాయి. వారికి ఇద్దరేసి పిల్లలున్నారు. కొంతకాలంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడి అతడి ప్రేమగా మారింది. వీలు చిక్కినప్పుడల్లా శారీరకంగానూ కలిసేశారు. Also Read: ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకోవడంతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు. ఏడాది క్రితం పిల్లలు, కుటుంబాలను వదలి పారిపోయారు. వీరి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే శనివారం గ్రామానికి చేరుకున్న ఈ జంట ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. యువకుడు అక్కడికక్కడే చనిపోగా.. మహిళను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి మ‌ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ జంట ఏడాది తర్వాత స్వగ్రామానికి ఎందుకొచ్చారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By May 31, 2020 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-and-men-commits-suicide-in-suryapet-district/articleshow/76115564.cms

No comments