Breaking News

హైదరాబాద్ పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. కత్తులతో కిరాతకంగా నరికి


హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీరాలం ట్యాంక్ వద్ద మహమ్మద్ అలియాస్ చోర్ మహమ్మద్(25) అనే యువకుడిని సయ్యద్ సిద్ధిఖి, షాజిద్, అజర్ అనే ముగ్గురు వ్యక్తులు తల్వార్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బహదూర్‌పురా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో కీలక ఆధారాలు సేకరించారు. మహమ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. Also Read: మహమ్మద్‌పై చాలాకాలంలో అనేక దొంగతనాలకు పాల్పడుతున్నాడని, కాలాపత్తార్ పీఎస్ పరిధిలో అతడిపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Also Read:


By May 31, 2020 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-brutally-murdered-in-old-city-hyderabad/articleshow/76116790.cms

No comments