Breaking News

ఆగ్రాలో భారీ వర్షం.. ఉరుములతో దెబ్బతిన్న తాజ్ మహాల్


కురిసింది. యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి చారిత్రక కట్టడం తాజ్‌ మహల్ తీవ్రంగా దెబ్బతింది. తాజ్ మహల్ పైన ఉన్న పాలరాతి, ఎర్ర ఇసుకరాతి రెయిలింగ్స్ దెబ్బతిన్నాయి. చెక్కతో చేసిన తాజ్‌మహల్‌ గేటు, పాలరాయి రెయిలింగ్‌, రెండు ఎరుపు సున్నపురాయి పలకలు దెబ్బతిన్నట్లు భారత పురావస్తు శాఖ అధికారి, ఆర్కియాలజిస్ట్‌ వసంత్‌ స్వర్ణకార్‌ తెలిపారు. తాజ్‌ మహల్‌ చుట్టుపక్కల కూడా ఈదురుగాలులకు చాలా చెట్లు నేలకొరిగాయి. టిక్కెట్స్‌ కౌంటర్‌తో పాటు పశ్చిమ ఎంట్రీ గేట్‌ దగ్గర పైవోట్‌ రాయి కూడా దెబ్బతిన్నట్లు అధికారి చెప్పారు. తాజ్‌మహల్ కట్టడం నుంచి ఓ ఎరుపు చలువరాయి కింద పడింది. ఈ ప్రాంతంలో దాదాపు పది చెట్లు విరిగిపడ్డాయి. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత పునరుద్ధరణ పనులు చేపడతామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. పెనుగాలులకు తాజ్ మహల్ పరిసరాల్లోని పలు కార్లు, ఇతర వాహనాలపై చెట్లు, భారీ స్థాయి ప్రాకారాలు కూలి పడ్డాయి. దాదాపు 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల శిథిలాల నుంచి ఆరేండ్ల బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. యమునా వైపున ఉండే కట్టడాలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు మరోవైపు యూపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. మెయిన్‌పురి, ఆగ్రా, లఖీంపూర్‌ కేరీ, ముజఫర్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పిడుగు పాటుకు ముగ్గురు వ్యక్తులు, పలు జంతువులు చనిపోయాయి. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు యోగి.


By May 31, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/heavy-rains-in-agra-taj-mahal-suffers-minor-damage-with-thunderstorm/articleshow/76116779.cms

No comments