Breaking News

సిగరెట్‌ అప్పుగా ఇవ్వలేదని టీ దుకాణానికి నిప్పు.. నిందితుడి అరెస్ట్


సిగరెట్‌ అప్పుగా ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి టీ దుకాణానికి నిప్పు పెట్టిన ఘటన తమిళనాడులో జరిగింది. మదురై జిల్లా నాగమలై పుదుకోట్టై సమీపంలోని అచ్చంబత్తు ప్రాంతానికి చెందిన భూమినాథన్‌ స్థానికంగా టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి టీ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఫైరింజన్ వచ్చేసరికే స్థానికులు కొంతమేర మంటలు ఆర్పివేశారు. వారిలో గుణశేఖర్ అనే వ్యక్తి కూడా మంటలు ఆర్పడంలో సాయం చేశాడు. Also Read: అనంతరం ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు నాగమలై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. టీ దుకాణానికి ఓ వ్యక్తి నిప్పు పెడుతున్న దృశ్యాలు సీసీ పుటేజీ రికార్డవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు స్థానికంగా ఉంటే గుణశేఖర్ అనే వ్యక్తి అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భూమినాథన్ తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదన్న కోపంతోనే టీ దుకాణానికి నిప్పు పెట్టినట్లు నిందితుడి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై గతంలోనూ అనేక కేసులు నమోదైనట్లు వెల్లడించారు. Also Read:


By May 29, 2020 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-set-tea-stall-ablaze-in-tamil-nadu-arrested/articleshow/76084493.cms

No comments