Breaking News

లాక్‌డౌన్ పొడిగింపుపై మహారాష్ట్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు


దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారిని నియంత్రించడానికి విధించిన 21 రోజుల దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 14న ముగియనుండగా.. దీనిని మరి కొన్ని రోజులు పొడిగిస్తారా? లేదా ముగుస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగింపుపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదువుతున్న ముంబయి లాంటి చోట్ల కొనసాగుతుందని ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే అన్నారు. అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. గురువారం మహారాష్ట్రలో మొత్తం 67 కేసులు నమోదుకాగా, ఒక్క ముంబైలోనే 53 నిర్ధారణ అయ్యాయి. అలాగే, ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ముంబైలోనే నలుగురు చనిపోయారు. కరోనా వైరస్‌తో ధారవీలో చనిపోయిన వ్యక్తికి ఢిల్లీ తబ్లీగ్ జమాత్ మత సమ్మేళనానికి హాజరైన వ్యక్తి నుంచి వైరస్ సోకినట్టు గుర్తించారు. మార్చి 22న మర్కజ్ జమాత్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన ఐదుగురు మహిళలు ఈయన ఫ్లాట్‌లో ఉన్నారని, మృతుడితో కాంటాక్ట్ అయ్యారని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 14 తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని రాజేశ్ తోపే అన్నారు. మహారాష్ట్రంలో మొత్తం 490 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా.. ఒక్క ముంబైలోనే 278 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా మహారాష్ట్రంలో కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్చి 30 వరకు 220 కేసులు నమోదు కాగా, 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన మూడు రోజుల్లోనే 270కిపైగా కేసులు నమోదు కాగా, 16 మంది మృతిచెందారు. ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా రాకపోకలు సాగించారు. దీంతో ముందు జాగ్రత్తగా 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను గత కొద్ది రోజులుగా క్వారంటైన్లో ఉంచారు. వీరిలో 11 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కస్తూర్బా హాస్పిటల్‌లో ఐదుగురు, ఎంజీఎం హాస్పిటల్‌లో ఆరుగురు జవాన్లకు చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం పుణే, జలగావ్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోవారు. జలగావ్ వ్యక్తికి (63)మరో కోవిడ్ రోగి నుంచి వైరస్ సోకింది. అతడికి డయాబెటిస్, బీపీతోపాటు నెల రోజుల కిందట గుండె నొప్పి రావడంతో ఏంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ముంబైలోని బోరివిల్లీ, గొరాయ్ ఎంబీహెచ్ కాలనీలో ఓ యువ జంటకు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో, చుట్టుపక్కల 80 కుటుంబాలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు.


By April 04, 2020 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/may-extend-lockdown-after-april-14th-says-maharashtra-health-minister/articleshow/74979199.cms

No comments