ఆస్తికోసం మూడు హత్యలు.. కూతుళ్లపై హత్యాయత్నం.... చివరికి తల్లి చేతిలో..

ఆస్తి కోసం కుటుంబసభ్యుల ప్రాణాలు తీస్తున్న ఓ నరరూప రాక్షసుడు చివరకు కన్నతల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రిని, బామ్మర్దిని, భార్య తాత చంపేసిన అతడు చివరకు భార్యను, కన్నబిడ్డలనూ హత్య చేసేందుకు అనేకసార్లు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో మనవరాళ్ల ప్రాణాలు కాపాడేందుకు కన్న కొడుకునే హతమార్చిందా తల్లి. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లా కోవూరు మండలం గంగవరంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. Also Read: గంగవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనసూయమ్మల కొడుకు గోపాల్రెడ్డికి ముగ్గురు కూతుళ్లు. మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండటంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తడంతో భార్య తమ్ముడిని హత్య చేసి జైలుకెళ్లాడు. విడుదలైన తరువాత ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. కొన్నాళ్లకు భార్య తాత శ్రీనివాసులురెడ్డిని కూడా విషమిచ్చి హత్య చేశాడు. నెల్లూరులోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న భార్య, కూతుళ్లను కూడా హత్యచేసేందుకు అనేకసార్లు విఫలయత్నం చేశాడు. Also Read: ఈ క్రమంలోనే శ్రీరామనవమి రోజు(ఈనెల 2న) ఇద్దరు కూతుళ్లను గోపాల్రెడ్డి తన ఇంటికి పిలిపించాడు. వారిని హతమార్చేందుకే పిలిపించాడని అనుమానించిన అనసూయమ్మ గోపాల్రెడ్డికి కూల్డ్రింక్లో పొటాషియం సైనైడ్ కలిపి ఇచ్చేసింది. అనంతరం అదే ద్రావకం తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా తల్లీకొడుకులు శవాలై కనిపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By April 05, 2020 at 10:24AM
No comments