Breaking News

ఎయిమ్స్: బిడ్డకు జన్మనిచ్చిన కరోనా రోగి.. చనుబాలు పట్టిన తల్లి


ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న ఓ నిండు గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశంలో ఈ తరహా ఇదే తొలి ఘటన. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే.. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకి ఉంటుందా అని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. కానీ, అలా సోకుతుందనడానికి ఆధారాలేవీ లేవని వైద్యులు తెలిపారు. అంతేకాదు, ఆ బిడ్డకు నిస్సందేహంగా చనుబాలు కూడా పట్టవచ్చని స్పష్టం చేశారు. బిడ్డను వైద్యులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారని.. కోవిడ్-19 లక్షణాలు తేలితే తగు చికిత్స అందిస్తామని చెప్పారు. ఎయిమ్స్ గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్న వైద్య నిపుణురాలు నీర్జా భట్ల శుక్రవారం (ఏప్రిల్ 3) రాత్రి సదరు గర్భిణికి శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులో నుంచి పండంటి మగబిడ్డను బయటకు తీసినట్లు తెలిపారు. డెలివరీ సమయానికంటే వారం రోజుల ముందే బిడ్డ జన్మించినట్లు వెల్లడించారు. బిడ్డకు కరోనా లక్షణాలేవీ లేవని నీర్జా భట్ల తెలిపారు. వైద్యులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. Watch: ఢిల్లీకి చెందిన 9 నెలల గర్భిణి కరోనా లక్షణాలతో గురువారం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్న తన భర్త నుంచి ఆమెకు వైరస్ సోకింది. ఆ వైద్యుడి ద్వారా అతడి సోదరుడికి కూడా కరోనా వైరస్ సోకడం గమనార్హం. ప్రస్తుతం వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. తల్లి పాలు సురక్షితమేనా..? పుట్టిన బిడ్డ ప్రస్తుతం తన తల్లితోనే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. చక్కగా తల్లి పాలు తాగుతున్నట్లు వివరించారు. తల్లి పాల ద్వారా కరోనా వైరస్ సోకుతున్నట్లు ఇప్పటివరకూ ఆధారాలేవీ లేవని వైద్యులు తెలిపారు. అయితే.. పాలు పట్టే సమయంలో తల్లి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్దదర్శకాలను కూడా విడుదల చేసింది. కోవిడ్-19 సోకిన గర్భిణులకు అందించే చికిత్స గురించి ఎయిమ్స్ కూడా పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్ సోకిన తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు తదితర రక్షణ కవచాలు ధరించాలని.. చేతులను, స్తన్యాలను పరిశుభ్రం చేసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. పాలు పట్టిన అనంతరం ఆ తల్లి బిడ్డను టచ్ చేసిన ఆయా శరీర భాగాలను పరిశుభ్రం చేయాలని తెలిపింది. చైనాలో గత ఫిబ్రవరిలో కరోనా బారిన పడ్డ ఓ నిండు గర్భిణి బిడ్డకు జన్మనిచ్చింది. Also Read: Don't Miss:


By April 05, 2020 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-positive-woman-gives-birth-to-baby-boy-in-aiims-delhi/articleshow/74990231.cms

No comments