ఆల్కహాల్ అనుకొని శానిటైజర్ తాగిన ఖైదీ, చివరికి..

జైలులో రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ.. ఆల్కహాల్ అనుకొని సేవించి మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జైలులో జరిగింది. రమణ్ కుట్టి అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా రిమాండ్లో ఉన్నాడు. ఇతణ్ని పాలక్కాడ్ జైలులో ఉంచారు. మరోవైపు, కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చేతులను శుభ్రపర్చుకొనేందుకు ప్రతి చోటా శానిటైజర్లను వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జైలులోనూ ప్రతి చోట శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, శానిటైజర్లకు కొరత లేకుండా జైళ్లలో ఖైదీలు చేసే పనిలో భాగంగా శానిటైజర్లు కూడా తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా శానిటైజర్లను తయారు చేయాలని పాలక్కాడ్ జైలు అధికారులు కూడా నిర్ణయించారు. మొత్తం ముడి సరకును ఏర్పాటు చేసుకొని ఖైదీలు శానిటైజర్ను తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు. శానిటైజర్లను తయారు చేస్తుండగా, దాని తయారీలో వాడే ప్రముఖమైన పదార్థం ఐసోప్రొఫేల్ ఆల్కహాల్ను రిమాండ్లో ఉన్న ఖైదీ రమణ్ కుట్టి అనే వ్యక్తి సేవించాడు. ఆ ద్రావణం తాగిన కాసేపటికే అతను కింద పడిపోయాడు. జైలు అధికారులు రమణ్ కుట్టిని వెంటనే పాలక్కాడ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఖైదీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఖైదీ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టాయి. Must Read: అయితే, రమణ్ కుట్టికి అంతకుముందు ఆల్కహాల్ అలవాటు ఉండడంతో, శానిటైజర్లో వాడే పదార్థం కూడా అటువంటి ఆల్కహాల్ అనుకొని భావించి తాగి ఉంటాడని జైలు సిబ్బంది భావిస్తున్నారు. ఈ ద్రావణం కూడా పెద్ద మొత్తంలో తాగడంతో పరిస్థితి మరింత విషమించి, అతను మరణించినట్లుగా వారు వెల్లడించారు. ఖైదీ మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కానున్నాయి. Also Read:
By March 27, 2020 at 11:33AM
No comments