Breaking News

లండన్ వచ్చి గుట్టుగా పెళ్లి... చిక్కుల్లో పడిన విశాఖ యువకుడు


విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్ పాటించి తీరాలని ప్రభుత్వాలు, అధికారులు ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించిన యువకుడిపై కేసు నమోదైంది. ప్రభావం తీవ్రంగా ఉన్న లండన్ నుంచి విశాఖ వచ్చిన ఆ యువకుడు బంధుమిత్రుల సమక్షంలో గుట్టుగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అంటు రోగాల నివారణ చట్టంతో పాటు మరో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. Also Read: విశాఖ నగరానికి చెందిన ఓ యువకుడు లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతడికి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన యువతితో గతంలోనూ వివాహం నిశ్చయమైంది. ఈ నెల 22వ వివాహం చేసేందుకు ముహూర్తాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు ఈనెల 14న లండన్‌ నుంచి విశాఖకు చేరుకున్నారు. కరోనా లేదంటూ వైద్య సిబ్బంది ఇచ్చిన ధ్రువపత్రాన్ని చూపించాక ఇంట్లోనే స్వీయ నిర్బంధం పాటించాలని సూచిస్తూ అధికారులు అతడిని పంపించారు. అప్పటినుంచి వైద్యాధికారులు అతడిని పర్యవేక్షిస్తున్నారు. Also Read: అయితే హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటే పెళ్లి వాయిదా పడుతుందన్న ఆందోళనతో ఆ యువకుడు అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యులతో కలిసి గుట్టుగా గన్నవరం చేరుకున్నాడు. ఓ కళ్యాణ మండపంలో 22వ తేదీన ఆ యువతిని పెళ్లాడాడు. విశాఖలో ఆ యువకుడి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన అధికారులు అతడి కోసం ఆరా తీయగా గన్నవరం వెళ్లి పెళ్లి చేసుకున్నాడని తేలింది. దీంతో వారు కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. గన్నవరం పోలీసులు ఆ యువకుడిని విచారించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


By March 27, 2020 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gannavaram-police-booked-case-against-vizag-software-engineer-over-who-didnt-participate-home-quarantine/articleshow/74838719.cms

No comments