Breaking News

కరోనా లక్షణాలతో.. హైదరాబాద్‌లో వృద్ధుడి మృతి.. దేశంలో తొలి కోవిడ్ మరణం!


లక్షణాలతో కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు హైదరాబాద్‌లో ప్రాణాలు కోల్పోయాడు. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు ఫిబ్రవరి 29న సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన్ను గులబర్గా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం అతడి పార్థీవ దేహాన్ని కలబుర్గి తీసుకెళ్లారు. కరోనా వైరస్ లక్షణాలతో 76 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ మరణించారని కలబుర్గి జిల్లా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎంఏ జబ్బార్ తెలిపారు. పేషెంట్ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామని.. ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉందని జబ్బార్ తెలిపారు. ఒకవేళ ఆయనకు కరోనా సోకిందని తేలితే.. భారత్‌లో నమోదైన తొలి కోవిడ్ మరణం కానుంది. తాజాగా ఢిల్లీ, రాజస్థాన్‌లలో ఒకరి చొప్పున కరోనా బారిన పడటంతో.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 62కు చేరింది. కర్ణాటకలో కొత్తగా మూడు కరోనా వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4కి చేరింది. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలగా.. అనంతరం పరీక్షల్లో ఆయన భార్య, కూతురికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు.


By March 11, 2020 at 02:54PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/76-year-old-karnataka-man-suspected-to-be-infected-with-coronavirus-dies/articleshow/74574864.cms

No comments