Breaking News

నాలుగేళ్ల ప్రేమ.. శారీరక వాంఛలు తీర్చుకుని మరో యువతితో పెళ్లి


నాలుగేళ్లు ప్రేమ పేరుతో నమ్మించి కోరికలు తీర్చుకున్న ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి మనస్తాపానికి గురైంది. ప్రియుడి చేతిలో మోసపోయిన తాను బ్రతకడం అనవసరం అనుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లా తుమ్మలపెన్‌పహాడ్‌లో వెలుగుచూసింది. తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన పులుగుజ్జు మల్సూరు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బంటు పావని(21) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. Also Read: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు పావనిని శారీరకంగానూ అనుభవించాడు. ఇటీవల ప్రియురాలికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో పెద్దల్లో పంచాయతీ పెడతానని పావని బెదిరించడంతో రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శనివారం మల్సూర్ ఇంటికెళ్లిన ఆమె తనను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన మల్సూర్ ఆమెను తీవ్రంగా కొట్టి తరిమేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో పురుగుల మందు తాగేసింది. Also Read: ఈ విషయం గమనించిన స్థానికులు ఆమెను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పావని తల్లిదండ్రులు గతంలోనే అనారోగ్యంతో చనిపోయారు. ప్రస్తుతం ఆమె తాత బంటు బుచ్చయ్య ఇంట్లో ఉంటోంది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పావని జీవితంతో ఆటాడుకుని ఆమె ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించిన మల్సూర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By March 23, 2020 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-in-suryapet-over-boy-friend-refuses-marry-her/articleshow/74766167.cms

No comments