భార్య నిద్రపోతుండగా ఉరి వేసిన భర్త.. ప్రభుత్వ ఉద్యోగి ఘాతుకం

కర్ణాటకలోని జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కోసం ఓ భర్త దారుణంగా ప్రవర్తించి వేశాడు. ఆమె నిద్ర పోతున్నప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడడం గమనార్హం. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలుకాలోని సోమనాథపుర గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. హుణసూరులోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో నిందితుడు వెంకటప్ప సహాయ అధికారిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య బాధితురాలు నాగవేణి (41). వెంకటప్పకు నాగవేణికి 1997లోనే వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ జంట అన్యోన్యంగానే ఉండేవారని స్థానికులు తెలిపినట్లుగా అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా వెంకటప్ప కట్నం పేరుతో భార్యను ప్రతి రోజు వేధించడంతో పాటు కొడుతుండేవాడు. ఈ క్రమంలోనే నెల 3వ తేదీన రాత్రి భార్యతో తార స్థాయిలో గొడవ పడ్డాడు. Also Read: భార్యను అడ్డుతొలగించుకోవాలనే దురాలోచనతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడని పోలీసులు చెప్పారు. ఆమె నిద్రపోతున్న సమయంలో చీరతో గొంతుకు ముడి బిగించాడు. ఆమె మేలుకుని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చి నాగవేణిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మైసూరు నగరంలోని ప్రవేట్ అస్పత్రిలో నాగవేణి చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు బాధితురాలి వద్ద వాంగ్మూలం తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వెంకటప్పను పోలీసులు అరెస్టు చేశారు. Must Read:
By March 06, 2020 at 10:35AM
No comments