Breaking News

కూలిపోయే దిశగా కమల్‌నాథ్ సర్కారు.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా


మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు పార్టీకి రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఆయన వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని శిబిరంలో ఉన్న 19 మంది సహా 20 మంది ఎమ్మెల్యేలంతా తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. కాగా, తమకు భద్రత కల్పించాలని కోరుతూ కర్ణాటక డీజీపీకి రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. తామంతా ముఖ్యమైన పనిమీద స్వచ్ఛందంగా బెంగళూరుకు వచ్చామని, ఇక్కడ తమకు తగినంత భద్రత కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ప్రస్తుతం హోలీ వేడుకల నిమిత్తం లఖ్‌నవూ వెళ్లారు. తాజా పరిణామాల గురించి తెలియగానే ఆయన తన పర్యటనను కుదించుకుని తిరిగి భోపాల్‌ బయల్దేరారు. గవర్నర్‌ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2018 చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. 107 సీట్లను గెలుపొందింది. ఎస్సీ, బీఎస్పీ చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయినప్పటికీ.. ఇతరుల సాయంతో బీజేపీకి అధికారాన్ని దూరం చేయగలిగింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అధికారానికి దూరం అవుతుందని ఊహించని బీజేపీకి కాంగ్రెస్ షాకిచ్చింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో సింధియా కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి వర్గం కాగా.. మరొకటి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వర్గం. మూడోది జ్యోతిరాదిత్య వర్గం. మరోసారి తనకు సీఎం పదవి డిగ్గీ రాజా దక్కుతుందని ఆశించారు. కానీ బీజేపీకి అధికారం దూరం చేసే లక్ష్యంతో కమల్‌నాథ్ సీఎం అభ్యర్థిత్వానికి ఆయన అయిష్టంగానే మద్దతు పలికారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌‌కు 114, బీజేపీ 107 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో మొత్తం సభ్యుల సంఖ్య 228. తాజాగా 20 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అమోదం పొందితే అసెంబ్లీ బలం 208కు తగ్గుతుంది. కమల్‌నాథ్‌ సర్కార్‌ గట్టెక్కాలంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.


By March 10, 2020 at 03:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/20-congress-mlas-including-six-ministers-submit-resignations-to-governor/articleshow/74562822.cms

No comments