Breaking News

ఇటలీలో కోవిడ్ మృత్యుకేళీ.. నిన్న ఒక్క రోజే 189 మంది మృతి


దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. చైనా తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ మరణాలు ఇటలీలోనే చోటుచేసుకుంటున్నాయి. ఆ దేశంలో కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు 1,000 మందికిపైగా మృతిచెందారు. గత 24 గంటల్లో 189 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. గడచిన 24 గంటల్లో మృతుల సంఖ్య 23 శాతం, బాధితుల సంఖ్య 21.7 శాతం పెరగినట్టు ఇటలీ పౌర రక్షణ విభాగం వెల్లడించింది. యూరప్‌లో కరోనా వైరస్ తీవ్రత ఇటలీలోనే ఎక్కువగా ఉంది. గురువారం కొత్తగా 2,600 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 15,113కి చేరింది. కోవిడ్ 19ను మహమ్మారిగా డబ్ల్యూహెచఓ ప్రకటించడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి ఇటలీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పౌరులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ వీటిని అతిక్రమించి ఎవరైనా బయటకు వస్తే జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అటు, ఐరోపాకు విమాన సర్వీసులను అమెరికా నిలిపివేసింది. ఇరాన్‌లోనూ కరోనా స్వైరవిహారం చేస్తోంది. కొత్తగా 1,000కి పైగా కేసులు నమోదుకాగా, మరో 75 మంది గురువారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాలు 429కి చేరింది. బాధితుల సంఖ్య కూడా 10వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19తో 4,900మంది ప్రాణాలు కోల్పోగా, 134,000 మందికి వైరస్ సోకినట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఇప్పటి వరకు 68,000 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. మరోవైపు, చైనాలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా ఏడు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని, మరో 21 మంది వైరస్ బారినపడ్డారని జాతీయ హెల్త్ కమిషన్ తెలిపింది. దీంతో కోవిడ్ మృతులు 3,176, బాధితుల సంఖ్య 80,813కి చేరింది. ఐరోపాలోని స్పెయిన్, ఫ్రాన్స్‌లోనూ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. గురువారం స్పెయిన్‌లో 31 మంది, ఫ్రాన్స్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదేశాల్లో కరోనా వల్ల మృతిచెందినవారి సంఖ్య 86, 61కి చేరింది. దక్షిణ కొరియాలో గురువారం మరో 224 కేసులు నిర్ధారణ కాగా, ఏడుగురు చనిపోయారు. అటు, భారత్‌లోనూ కోవిడ్ తొలి మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో మంగళవారం చనిపోయిన 70 ఏళ్ల కర్ణాటక వ్యక్తి కరోనాతోనే మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు చెప్పారు.


By March 13, 2020 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/italy-coronavirus-death-toll-surges-past-1000-death-rate-rise-of-23-percent/articleshow/74605113.cms

No comments