Breaking News

కరోనా ఎఫెక్ట్.. అలా చేస్తే రూ.1000 జరిమానా


ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్‌‌ను వైరస్ భయం వెంటాడుతోంది.. ప్రభుత్వాలు అప్రమత్తమైన ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ఫోకస్ పెట్టారు.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వారి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటూ అబ్జర్వేషన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాపిస్తుండటంతో బహిరంగ స్థలాల్లో పారిశుధ్ధ్యం మెరుగుపరిచే పనిలో ఉంది. దీనిలో భాగంగా బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.. ముంబైలో బహిరంగంగా ఉమ్మి వేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. నగరంలో ఎక్కడైనా బహిరంగంగా ఉమ్మి వేస్తే ఫైన్ కట్టాల్సిందేనని అధికారులు చెప్పారు.. ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. నగరంలో మొత్తం 107 మంది నుంచి రూ.1.07లక్షల జరిమానాను వసూలు చేశారు అధికారులు. మరో 46 మందికి బహిరంగంగా ఉమ్మి వేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ ను నివారించేందుకు నగరవాసులు సహకరించాలని కోరారు. ఎవరైనా ఉమ్మి వేస్తే.. వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని, ఐపీసీ సెక్షన్ 189 సెక్షన్ ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


By March 19, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-effect-bmc-hikes-spitting-fine-from-rs-200-to-rs-1000/articleshow/74702919.cms

No comments