వాట్సాప్లో న్యూడ్ ఫోటోలు, వీడియోలు.. యువతిని వేధిస్తున్న పోకిరీ అరెస్ట్

వాట్సాప్లో యువతిని న్యూడ్ ఫోటోలు, అసభ్య మెసేజ్లు పంపిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఇంజినీరింగ్ చదువుతున్న మాణిక్యం అరుణ్ ప్రసాద్(25) అనే యువకుడు నకిలీ ధ్రువపత్రాలతో అనేక ప్రీ యాక్టివేటెడ్ సిమ్లను సంపాదించాడు. వాటిని ఉపయోగించి నగలు, చీరలు అమ్మే వ్యాపారిగా ఓ వాట్సాప్ గ్రూపు సృష్టించి మహిళల ఫోన్నంబర్లు సేకరించడం మొదలుపెట్టాడు. Also Read: ఇదేవిధంగా హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన ఓ యువతి నంబర్ సేకరించి ఆమెతో అసభ్యంగా ఛాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఫోటోను న్యూడ్గా మార్ఫింగ్ చేసి వాట్సాప్లో పంపించాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు కొద్దిరోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Also Read: అరుణ్ ప్రసాద్ సెల్ఫోన్లో అనేక మంది యువతులు, ఆంటీల ఫోన్ నంబర్లు, ఫోటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఇదే విధంగా గతంలోనూ అనేక మందిని వేధించినట్లు గుర్తించారు. అమ్మాయిలు తమ ఫోటోలు, వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్ చేయడం వల్లనే ఇలాంటి అనర్థాలు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By February 26, 2020 at 11:30AM
No comments