పెళ్లయిన 20 రోజులకే కలహాలు.. కుప్పంలో యువకుడి అదృశ్యం

జిల్లా కుప్పంలో కొత్త పెళ్లికొడుకు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భార్యను తీసుకొస్తానంటూ రెండ్రోజుల క్రితం అత్తారింటికి బయలుదేరిన యువకుడు కనిపించకుండా పోయాడు. అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళణ చెందుతున్నారు. Also Read: కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయతీ అత్తూరు గ్రామానికి చెందిన హేమంత్కుమార్కు అదే మండలంలోని వెన్నగంపల్లి గ్రామానికి చెందిన మీనాతో జనవరి 31న ఘనంగా వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజులకు దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భర్త, అత్తమామలపై అలిగిన మీనా పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని అత్తింటి వారు ఎన్నిసార్లు ఫోన్ చేసి మీనా ససేమిరా అంటోంది. దీంతో భార్యకు నచ్చజెప్పి తీసుకొస్తానంటూ హేమంత్కుమార్ రెండ్రోజుల క్రితం అత్తారింటికి బయలుదేరి వెళ్లాడు. Also Read: అప్పటి నుంచి అతడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆందోళన పడిన తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎలాంటి స్పందనా లేదు. దీంతో వారు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హేమంత్కుమార్ను మీనా బంధువుల ఏదైనా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులకు పట్టించుకోవడం లేదంటూ గురువారం రాత్రి వారంతా స్టేషన్ ఎదుటే ఆందోళన చేపట్టారు. Also Read:
By February 21, 2020 at 11:37AM
No comments