YS Jagan నిర్ణయం.. ఒకే జిల్లా నుంచి ఏడుగురు నేతలకు షాక్

శాసన మండలిని రద్దు చేస్తూ.. ఏపీ శాసన సభ సోమవారం తీర్మానం చేసింది. దీన్ని కేంద్రానికి పంపనున్నారు. పార్లమెంట్ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి సంతకం చేయగానే.. మండలి రద్దవుతుంది. దీనికి కొంత సమయం పడుతుందేమో గానీ.. రద్దు కావడం మాత్రం అనివార్యం. శాసన మండలిని రద్దు చేయడంతో.. నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏడుగురు ఎమ్మెల్సీలు తమ పదవులను కోల్పోనున్నారు. టీడీపీకి చెందిన అన్నం సతీష్ ప్రభాకర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్సీ పదవులను కోల్పోనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఎమ్మెల్సీ పదవిని కోల్పోతున్న వారి జాబితాలో ఉన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన లోకేశ్.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడారు. ఆయనతోపాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకటరమణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ ఈ జాబితాలో ఉన్నారు. లోకేశ్, మోపిదేవి వెంకటరమణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక కాగా.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల కోటాలో, కేఎస్ లక్ష్మణరావు గ్రాడ్యుయేట్ల కోటాలో, ఏఎస్ రామకృష్ణ టీచర్ల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వాస్తవానికి గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీ చేసి.. మంత్రి పదవి ఇస్తామని ఎన్నికల వేళ సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో కనీసం ఎమ్మెల్సీ అయిన చేస్తారని, తర్వాతి విడతలోనైనా అమాత్య యోగం దక్కుతుందని ఆయన ఆశతో ఉన్నారు. 1985లో ఎన్టీఆర్ మంత్రి మండలిని రద్దు చేసినప్పుడు కూడా ఇద్దరు ఎమ్మెల్సీ పదవులను కోల్పోయారు. ముప్పలనేని శేషగిరి రావు, ఆచంట రంగనాయకులు అప్పట్లో పదవులు కోల్పోయారు. వీరిద్దరీ ఒకే సామాజిక వర్గం కావడం గమనార్హం.
By January 28, 2020 at 10:18AM
No comments