TDP ఎమ్మెల్సీలకు ఆయన డబ్బులు ముట్టజెబుతున్నారు.. వైసీపీ ఎంపీ సంచలనం
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకున్నారు. అధకారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడన్న విజయసాయి.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బులు ముట్టజెబుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారోనని బాబు నిద్రపోవడం లేదని ఎద్దేవా చేశారు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీతభత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట అంటూ ఆయన ట్వీట్ చేశారు. శాసన మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులేస్తున్న వేళ.. విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్సీపీ తమ ఎమ్మెల్సీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఒక్కో ఎమ్మెల్సీకి రూ.5 కోట్లు ఆఫర్ చేశారని విమర్శించింది. తమ ఎమ్మెల్సీలను లాగేసుకొని... రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకుండా చేయాలని వైఎస్సార్సీపీ ప్రయత్నించిందని ఆరోపించింది. ఎమ్మెల్సీలు చేజారకుండా చంద్రబాబు జాగ్రత్త వహించారు. నిరంతరం ఎమ్మెల్సీలతో టచ్లో ఉండాల్సిన బాధ్యతను యనమల, అచ్చెన్నాయుడికి చంద్రబాబు అప్పగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉండాలని కూడా టీడీపీ నిర్ణయించింది.
By January 27, 2020 at 09:19AM
No comments