Breaking News

ప్రకాశ్ రాజ్, మాజీ సీఎం సహా 13 మందిని చంపుతామని బెదిరింపు లేఖ.. తేదీ కూడా వెల్లడించారు!


ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి బృందా కారత్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోపాటు మరో 13 మందిని హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులను బెదరింపులు వచ్చాయి. సంఘ్‌ పరివార్‌పై విమర్శులు గుప్పిస్తోన్న నిజగుణానందస్వామికి బెదిరింపులు లేఖ రాసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఇందులో వీరి పేర్లను కూడా ప్రస్తావించారు. బెళగావిలోని నిజగుణానంద మఠానికి ఈ లేఖ వచ్చింది. ఈ లేఖను తన ట్విట్టర్‌ ఖాతాలో ఉంచారు. కన్నడలో రాసి ఆ లేఖలో ‘ధర్మ ద్రోహులు, దేశద్రోహులను జనవరి 29న అంతంచేయడానికి ముహూర్తం నిర్ణయించాం.. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి... నిజగుణానందస్వామీ! మీరు ఒక్కరే కాదు. దిగువ ఉన్న పేర్లను చూడండి. వారిని కూడా చివరి ప్రయాణానికి మీరే సిద్ధం చేయాలి’ అని పేర్కొన్నారు. దీనిపై బెళగావి ఎస్పీకి ఫిర్యాదుచేసిన నిజగుణానంద శిష్యులు.. లేఖను కూడా అందజేశారు. ఆశ్రమానికి అదనపు భద్రత కల్పిస్తామన్న పోలీసుల ప్రతిపాదనను మఠాధిపతి తిరస్కరించారు. తనకూ బెదిరింపులు వచ్చాయని కుమారస్వామి శనివారం వరుస ట్వీట్లు చేశారు. లేఖలో బజరంగ్ దల్ నేత మహేంద్ర కుమార్, నిజగుణానంద అసూరి స్వామి, నిడుమామిడి వీరభద్ర చెన్నమళ్లస్వామి, ప్రకాశ్ రాజ్, జ్ఞానప్రకాశ్ అసూరీ, నటుడు చేతన్ కుమార్, బీటీ లలిత్ నాయక్, మైసూర్‌కు చెందిన ప్రొఫెసర్లు మహేశ్‌చంద్ర గురు, భగవాన్, దినేశ్ అమైన్ మట్టు, చంద్రశేఖర్ పాటిల్, దుండి గణేశ్, రౌడి అగ్ని శ్రీధర్, బృందా కారత్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్లు ఉన్నాయి.


By January 27, 2020 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/threat-to-kill-actor-prakash-raj-and-communist-leader-brinda-karat-ex-cm-hd-kumaraswamy/articleshow/73652820.cms

No comments