Breaking News

లిస్బన్‌ పబ్‌లో లైంగిక వేధింపుల కేసు... పోలీసులకు షాకిచ్చిన బాధితురాలు


బేగంపేటలోని లిస్బన్ పబ్‌ యజమాని ఓ డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులో వచ్చింది. మురళీకృష్ణపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాధితురాలు షాకిచ్చింది. తనను పబ్‌లోకి అనుమతించని కారణంగా క్షణికావేశంలో ఆయనపై ఫిర్యాదు చేశానని, అప్పుడు తాగిన మైకంలో ఉండటంతో పొరపాటు చేశానని పోలీసులకు చెప్పింది. తన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని పంజాగుట్ట పోలీసులకు తెలిపింది. Also Read: వివరాల్లోకి వెళ్లే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ డ్యాన్సర్(23) మెహిదీపట్నం నానల్‌నగర్‌లో నివసిస్తోంది. ఆమె తరుచూ లిస్బన్ పబ్‌కు వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పబ్‌కు వెళ్లిన ఆమెను యజమాని మురళీకృష్ణ లోనికి అనుమతించలేదు. దీంతో ఆమె పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మురళీకృష్ణ తనను గదిలోకి పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆయనపై నిర్భయ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసినట్లయింది. Also Read: లిస్బన్‌ పబ్‌కు షోకాజ్‌ నోటీసులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన లిస్బన్‌ పబ్‌ యాజమాన్యానికి స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ గురువారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ పబ్‌పై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని.. ఇటీవల సంస్థలో పనిచేస్తున్న మేనేజర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో పబ్‌ను ఎందుకు మూసివేయకూడదంటూ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ... హైదరాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ సీఆర్‌పీసీ 133 సెక్షన్‌ ప్రకారం జారీ చేసిన షోకాజ్‌ నోటీసులను పబ్‌ యజమాన్యానికి పంజాగుట్ట పోలీసులు అందజేశారు. వివరణ సక్రమంగా లేకపోతే పబ్‌ను సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. Also Read:


By January 31, 2020 at 10:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sexual-harassment-dancer-in-lisbon-pub-victim-of-the-case-was-refund/articleshow/73791680.cms

No comments