ఉన్నావ్లో మరో ఘోరం.. రేప్ జరిగాకే ఫిర్యాదు తీసుకుంటామన్న పోలీసులు

బాధితురాలిని సజీవ దహనం చేసిన ఘటనపై ఉత్తర్ప్రదేశ్ అట్టుడుకున్నా ఆ రాష్ట్ర పోలీసుల్లో చలనం కలగడం లేదు. కామాంధుల అకృత్యాలకు ఎందరో మహిళలు బలైపోతున్నా నేరాల కట్టడికి వారు ఏం చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తాజాగా తనపై అత్యాచారయత్నం చేయబోయారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళకు పోలీసుల నుంచి చీత్కారం ఎదురైంది. రేప్ జరగలేదుగా.. జరిగిన తర్వాత వచ్చి ఫిర్యాదు చేస్తే తీసుకుంటాం’ అంటూ ఎగతాళి చేసి పంపించారు. Also Read: బాధితురాలి కథనం ప్రకారం.. ఐదు నెలల క్రితం మందులు కొనడానికి వెళ్తున్న మహిళలను ఐదుగురు యువకులు అడ్డగించి అత్యాచారం చేయబోయారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి 1090 నంబర్కి ఫోన్ చేస్తే.. వాళ్లు 100కి కాల్ చేయమన్నారు. తర్వాత ఉన్నావ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. ఘటన జరిగిన ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందో ఆ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని చెప్పారు. మూడు నెలలుగా ఆయా పోలీస్స్టేషన్లు తిరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోవడం లేదు’ అని చెప్పింది. Also Read: తాజాగా మరోసారి ఉన్నావ్ పోలీస్స్టేషన్కు వెళ్లిన బాధితురాలిని పోలీసులు ఎగతాళి చేశారు. ‘రేప్ జరగకుండానే ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావ్. ఒకవేళ వారు నిన్ను రేప్ చేస్తే అప్పుడు వచ్చి ఫిర్యాదు చేయ్. కేసు నమోదు చేస్తాం’ అంటూ అమెను అవమానించారు. ఓ వైపు చంపేస్తామంటూ ఆ కామాంధుల బెదిరింపులు, మరోవైపు పోలీసుల ఉదాసీన వైఖరితో బాధితురాలు భయాందోళనకు గురవుతోంది. ఉన్నావ్ రేప్ బాధిరాలిని సజీవ దహనం చేసిన సింధుపూర్ గ్రామంలోనే ఈ ఘటన జరగడం మరింత ఆందోళన పరిచే విషయం. Also Read:
By December 08, 2019 at 09:02AM
No comments