నిర్భయ దోషులను నేను ఉరితీస్తా: తీహార్ జైలుకు తమిళ పోలీసు లేఖ

తీహార్ జైలులో ఉన్న నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తమిళనాడుకు చెందిన ఓ పోలీసు ముందుకొచ్చాడు. తాను వారందరినీ ఉరి తీసేందుకు తనకు అవకాశమివ్వాలంటూ అధికారులకు లేఖ రాశారు. రామనాథపురం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుభాష్ శ్రీనివాసన్ ఈ లేఖ రాయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. Also Read: దోషులను త్వరగా శిక్షించాలనే ఉద్దేశంతోనే తాను వారికి ఉరిశిక్ష అమలు చేసేందుకు ముందుకొచ్చినట్లు శ్రీనివాసన్ లేఖలో పేర్కొన్నారు. శ్రీనివాసన్ చాలాకాలంగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ, మానసిక రోగులకు సహాయం తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె నుంచి ‘అన్నా’ పతకం, జిల్లా కలెక్టరు నుంచి పలు అవార్డులనూ పొందారు. తాజాగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష తాను అమలు చేస్తానంటూ లేఖ రాయడం ద్వారా దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యారు. Also Read: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ ఘటన దోషులను 8ఏళ్లయినా ఉరి తీయకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్లో ‘దిశ’ హత్యాచారం ఘటన నిందితులను పోలీసులు 10 రోజుల్లోనే ఎన్కౌంటర్ చేయడంతో తెలంగాణ పోలీసులకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్భయ దోషులకు ఉరిశిక్ష త్వరగా అమలు చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. Also Read:
By December 08, 2019 at 08:39AM
No comments